
భద్రాచలం, వెలుగు : ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్కు వరద వచ్చి చేరుతోంది. మే నెల చివరి వారంలోనే ప్రాజెక్ట్కు నీరు రావడం ఇదే మొదటిసారి. మరో వైపు ప్రాజెక్ట్ నిర్వహణ పనులు చేపట్టిన ఇంజినీర్లు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. గేట్లు అన్నీ ఓపెన్ చేసి నిర్వహణ పనులను స్పీడప్ చేసినట్లు ఏఈ ఉపేందర్ తెలిపారు.