- ఆర్థిక సంస్థలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పిలుపు
న్యూఢిల్లీ:ఎకానమీలో కొత్తగా వచ్చే ఐడియాలకు డబ్బు ఇచ్చేలా ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ మోడల్స్పై ఫోకస్ పెట్టమని ఆర్థిక సంస్థలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సూచించారు. ఈ టైములో గ్రీన్ ఫైనాన్సింగ్ చాలా అవసరమని, 2070 నాటికి జీరో కార్బన్ ఎమిషన్స్ టార్గెట్ను అందుకోవాలని చెప్పారు. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్టులకు భారీగా అప్పులు ఇవ్వాలని పేర్కొన్నారు. బడ్జెట్పై జరిగిన ఒక వెబినార్లో మోడి పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సక్సెస్ కావాలంటే, వాటికి ఫైనాన్సింగ్ చాలా ముఖ్యమని మోడి చెప్పారు.
ఫిన్టెక్, అగ్రిటెక్,మెడిటెక్, స్కిల్ డెవలప్మెంట్ రంగాలలో ముందడుగు వేస్తే తప్ప, ఇండస్ట్రీ 4.0 సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ రంగాలకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సాయమందిస్తేనే దేశం ముందుకు దూసుకెళ్తుందని అన్నారు. కన్స్ట్రక్షన్, స్టార్టప్స్, డ్రోన్స్, స్పేస్, జియో స్పేషియల్ డేటా వంటి 8–10 రంగాలను ఎంపిక చేసి, వాటికి అప్పులు ఇవ్వాలని చెప్పారు. ఆ రంగాలలో గ్లోబల్టాప్ 3 పొజిషన్కి ఎదిగేలా ప్రయత్నం జరగాలని సూచించారు. మెడికల్ ఎడ్యుకేషన్లో సవాళ్లున్నాయని, మరిన్ని మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలని చెప్పారు. ఈ రంగానికీ ఆర్థిక సంస్థలు అప్పులు ఇవ్వాలని అన్నారు.