స్విగ్గీ ప్లాట్‌‌ఫామ్ ఫీజు పెంపు 

స్విగ్గీ ప్లాట్‌‌ఫామ్ ఫీజు పెంపు 

న్యూఢిల్లీ:  ఫుడ్ డెలివరీ ప్లాట్‌‌ఫామ్ స్విగ్గీ తన ప్లాట్‌‌ఫామ్ ఫీజును పెంచింది. ఒక్కో ఆర్డర్‌‌పై ఫీజును 17 శాతం పెంచి రూ.17.58 గా నిర్ణయించింది. కొద్దిరోజుల క్రితం దీని పోటీ కంపెనీ జొమాటో కూడా ఫీజును పెంచింది. ప్రస్తుతం జీఎస్​టీతో కలిపి రెండు సంస్థల ఫీజులు దాదాపు సమానంగా ఉన్నాయి. ఆపరేటింగ్ ఖర్చులు, సాంకేతిక నిర్వహణ కోసం ఈ ఫీజును పెంచామని కంపెనీ తెలిపింది.  యుద్ధం వల్ల చమురు ధరలు పెరగడంతో డెలివరీ ఖర్చులు కూడా భారంగా మారాయి.  స్విగ్గీ గత  సెప్టెంబర్‌‌లోనూ ప్లాట్​ఫామ్​ఫీజును పెంచింది.