బిర్యానీ హోటల్ లో కుళ్లిన చికెన్..15 మందికి వాంతులు

బిర్యానీ హోటల్ లో కుళ్లిన చికెన్..15 మందికి వాంతులు

మెదక్  జిల్లా నర్సాపూర్ పట్టణంలోని మన్నత్ బిర్యానీ మండి హోటల్ లో బిర్యానీ తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. బాధితుల వివరాల ప్రకారం..శనివారం హోటల్ లో బిర్నానీ తినన ఐదుగురు అస్వస్థతకు గురికాగా, ఆదివారం మరో 15 మందికి వాంతులయ్యాయి. ఇందులో 14 మంది నర్సాపూర్ లో ప్రభుత్వ ఆస్పత్రిలో ,మిగతా వాళ్లు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుళ్లిన చికెన్ నాణ్యతలేని వంట నూనెల కారణంగానే ఫుడ్ పాయిజన్ అయ్యిందని డాక్టర్లు చెప్పారు. విషయం తెలుసుకున్న ఫుడ్ ఇన్ స్పెక్టర్  సునీత, డిప్యూటీ డీఎంహెచ్ వో నిర్మల ,మున్సిపల్ కమిషనర్ వేణు గోపాలు హోటల్ లను తనిఖీ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపామని రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు