పర్యవేక్షణ లేకనే హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్

పర్యవేక్షణ లేకనే హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య శాఖ మంత్రి ఇలాకాలోనే సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ జరగడం విచారకరమని, బాధ్యులందరిపై చర్య తీసుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి డిమాండ్ చేశారు. గాంధీభవన్​లో ఆమె మీడియాతో మాట్లాడుతూ హరీశ్​ను ​పవర్​ఫుల్ మంత్రి అంటారని, ఆయన నియోజకవర్గం సిద్ధిపేటలోనే ఈ ఘటన జరిగిందని గుర్తు చేశారు. ఫుడ్​ పాయిజనింగ్​తో పిల్లలు 5  రోజులు బాధపడ్డారన్నారు. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉండడం విచారకరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని అన్నారు. సిద్దిపేట మైనార్టీ గురుకులంలో జరిగిన ఆహార కల్తీపై విచారణ చేపట్టి బాధ్యుల్ని శిక్షించాలని ఆమె డిమాండ్​ చేశారు.