కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత

కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత

జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. గత మూడు రోజులుగా ఫుడ్ సరిగా లేదని.. ఇవాళ బయట నుండి ఫుడ్ తీసుకువచ్చారని విద్యార్థులు చెబుతున్నారు. ఆ ఆహారం తినడంతో ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులు తెలిపారు. అస్వస్థతకు గురైన  ముగ్గురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో పాఠశాలలో గందరగోళం నెలకొంది.