అమీర్పేట్, టోలిచౌకిలో బిర్యానీ తింటున్నారా..? ఎలుకలు, బొద్దింకలను పెంచుతున్న ఈ హోటల్స్ గురించి తెలుసుకోవాల్సిందే!

అమీర్పేట్, టోలిచౌకిలో బిర్యానీ తింటున్నారా..? ఎలుకలు, బొద్దింకలను పెంచుతున్న ఈ హోటల్స్ గురించి తెలుసుకోవాల్సిందే!

కోచింగ్ సెంటర్స్, షాపింగ్ మాల్స్ తో నిత్యం కిటకిటలాడే అమీర్ పేట్ లో బిర్యానీ తినేవాళ్లకు అలర్ట్. ఫేమస్ హోటల్స్, రెస్టారెంట్స్ కదా అని బిర్యానీ తినేందుకు ముందు కొంచెం తెలుసుకుంటే మంచింది. కిచెన్ లో ఎలుకలు, బొద్దింకలను పెంచుకుంటున్నట్లుగా మెయింటైన్ చేస్తున్నారు హోటల్ సిబ్బంది. టోలిచౌకిలో కూడా అదే పరిస్థితి. ఫుడ్ సేఫ్టీ అధికారులు  చేసిన సోదాల్లో హోటల్స్ కిచెన్లు అధ్వాన్న పరిస్థితులలో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. 

శుక్రవారం (మార్చి 7) ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ అమీర్పేట్ లోని తాజా కిచెన్, అమోఘ్ హోటల్ లతో పాటు.. టోలిచౌకి లోని 4 సీజన్ మల్టి కొసైన్ రెస్టారెంట్ లలో సోదాలు నిర్వహించారు. కిచెన్ పరిసరాలను, నిల్వ ఉంచిన పదార్థాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు అధికారులు. పేరులో తాజా ఉన్న హోటల్ తాజా పదార్థాలు వాడట్లేదని, అమోఘ్ అనే పేరు పెట్టిన హోటల్లో అమోఘమైన వంటకాలు లేవని తెలిపరు. ఈ హోటల్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని తెలిపారు.

హోటల్స్ లో పాడైన కూరగాయలు వాడుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా తుప్పుపట్టిన కత్తులతో కూరగాయలు, నాన్ వెజ్ కట్ చేస్తున్నట్లు తెలిపారు. బిర్యానీ ఇతర వంటకాలలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. 

కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తి చేశారు అధికారులు. కిచెన్ లో బొద్ధింకలు, ఎలుకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. వెజ్, నాన్ వెజ్ ఒకే చోట స్టోర్ చేస్తున్న హోటల్ నిర్వాహకులపై చర్యలకు ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రత పాటించని ఇలాంటి హోటల్స్ లో తింటే అనారోగ్యం తప్పదని హెచ్చరించారు.