ప్రెసిడెంట్ అయినా ఫైన్ వేసిన ఆఫీసర్లు
చిలీ: కరోనా రూల్స్ విషయంలో ఎవరైనా సరే అంటూ చిలీ అఫీసర్లు తమ ప్రెసిడెంట్ను కూడా వదిలిపెట్టలే. బీచ్లో మాస్క్ పెట్టుకోకుండా మహిళతో సెల్ఫీ తీసుకున్నందుకు ప్రెసిడెంట్ సెబాస్టియన్ పినేరాకు 3,500(రూ.2.57 లక్షలు) డాలర్ల ఫైన్ వేశారు. ఈ లాటిన్ అమెరికా దేశంలో కరోనా రూల్స్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లోకి వస్తే తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలి. లేకపోతే ఫైన్ వేయడమే కాదు జైలుకూ పంపించే చాన్సులు ఉంటాయి. పినేరా సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయన క్షమాపణ చెప్పారు. కాచాగువాలో నడుచుకుంటూ వెళ్తుండగా, ఎవరో ఒకామె గుర్తుపట్టి సెల్ఫీ తీసుకుందని చెప్పారు.
