హైదరాబాద్, వెలుగు: బాలపూర్ కి చెందిన నాగరాజు వ్యాపారి. కల్వకుర్తి నుంచి సిటీకి వచ్చేందుకు క్రూజర్ వెహికల్ ఎక్కి సోమవారం
రాత్రి చాంద్రాయణగుట్ట చౌరస్తాలో దిగాడు. దిగే హడావుడిలో వెంట తెచ్చుకున్న బ్యాగ్ ను మరిచిపోయాడు.
ఇంటికి వెళ్లాక బ్యాగ్ మిస్సయినట్లు గుర్తించాడు. వెంటనే చాంద్రాయణగుట్ట స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీ పుటేజీల ఆధారంగా వెహికల్ ను గుర్తించి డ్రైవర్ ను అడగ్గా దొరికిందని పోలీసులకు అప్పగించాడు. బాధితుడిని పిలిచి బ్యాగ్ అప్పగించారు. అందులో బంగారు నగలు ఉన్నాయని చెప్పాడు.