మాదిగలకు 2 ఎంపీ సీట్లు ఇవ్వాలి

మాదిగలకు 2 ఎంపీ సీట్లు ఇవ్వాలి
  •      రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి​

ఖైరతాబాద్,వెలుగు :  వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని  ఎస్సీ కార్పొరేషన్​ మాజీ చైర్మన్​, మాదిగ జేఏసీ  వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి  ప్రధాన రాజకీయ పార్టీలను డిమాండ్​ చేశారు.   తెలంగాణ దళిత బహుజన సమితి రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రవి మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం 75శాతం ఉన్న మాదిగలకు 3 ఎంపీ సీట్లు  దక్కాల్సి ఉందన్నారు.  అలా కాకున్నా వరంగల్​, పెద్దపల్లి సీట్లును మాదిగలకు కేటాయించాలని ఆయన కోరారు.  

ఈసందర్భంగా తెలంగాణ దళిత బహుజన సమితి అధ్యక్షుడుగా గజ్జెల్లి  మల్లికార్జున్​, ఉపాద్యక్షుడిగా రఘునాథ్​, మేడా శ్రీను, ప్రధాన కార్యదర్శిగా  లింగాల కరుణాకర్​, ప్రచార కమిటీ చైర్మన్​ గా ఎం.కార్తీక్​ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం వివిధ జిల్లాలు, మండల కమిటీలను ప్రకటించి సర్టిఫికెట్లను అందజేశారు.