టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శివ ప్రసాద్ 1999,2004 మధ్య కాలంలో మంత్రిగా పనిచేశారు.2009,2014లో చిత్తూరు నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శివప్రసాద్ ఓటమిపాలయ్యారు.శివప్రసాద్ ఎంపీగా  సమైక్యాంధ్ర,ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు ఆవరణలో విచిత్ర వేషాధారణలతో నిరసన తెలిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు.

శివప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ,డైరెక్టర్ గా పలు సినిమాల్లో నటించారు. పిల్లజమీందార్, ఆటాడిస్తా, జైచిరంజీవా,దూసుకెళ్తా, ,తులసి,ఒక్కమగాడు,మస్కా వంటి పలు సినిమాల్లో నటించారు. డేంజర్ సినిమాలో విలన్ పాత్రకు నంది అవార్డ్ వచ్చింది.