- మోత్కుపల్లి నర్సింలు, రఘునందన్రావ్
మెదక్/చేగుంట, వెలుగు: ఒక్క ఏడాది బిడ్డకు పదవి లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఎమ్మెల్సీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల గురించి మాత్రం ఆలోచించడం లేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు, దుబ్బాక ఉప ఎన్నికల బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ రావ్ అన్నారు. శనివారం చేగుంట మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది సుజాత రఘుపతి, రాష్ట్ర యోగ, ఫెన్సింగ్ కోచ్ కరణం గణేష్ రవికుమార్, రెడ్డిపల్లి ఎంపీటీసీ శంభుని రవి వారి అనుచరులతో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ మంత్రి హరీశ్రావ్ చేగుంటకు శాంక్షన్ అయిన ఈఎస్సై హాస్పిటల్ను సీఎం నియోజకవర్గంలోని మనోహరాబాద్ కు, డిగ్రీ కాలేజ్ సిద్దిపేటకు తరలించారని ఆరోపించారు. అలాంటిది ఇప్పుడు వచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభారాణి, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.