మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కన్నుమూత

కడప: సీనియర్ రాజకీయ నేత, వ్యాపారవేత్త అయిన మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 1989లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన  కడప ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు. అటు తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు ప్రోద్భలంతో  2004, 2009 ఎన్నికల్లో కడప నుండి పోటీ చేసినా ఓటమిపాలయ్యారు.  ఆ తర్వాత  బిజెపిలో చేరిన ఆయనకు మంచి వ్యాపారవేత్తగా కందుల శివానందరెడ్డికి గుర్తింపు ఉంది. కందుల గ్రూప్స్ పేరుతో ఆయన పలు విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు కందుల ఫ్యామిలీకి  ప్రత్యర్థిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. కాలక్రమంలో కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆయన రాజకీయాలకు దూరంగా మౌన వ్రతం పాటిస్తూ వస్తున్నారు.