- మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైర్
శామీర్ పేట వెలుగు : లోక్ సభ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే హరీశ్రావు అక్రమాల బండారం బయటపెడతామని మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. ఆదివారం శామీర్ పేట మండలం తూంకుంట మున్సిపాలిటీలోని అంతాయపల్లి లో సోమవారం జరిగే ముఖ్యమంత్రి జన జాతర బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రష్ యాదవ్, పార్టీ నేత నక్క ప్రభాకర్ తో కలిసి పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్లీడర్లు ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమంలో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో 15 సీట్లు గెలుస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బలేశ్, తూంకుంట మున్సిపాలిటీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, నేతలు మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.