అసత్య ప్రచారాలు వద్దు.. పార్టీ మార్పు పై పుట్టా మధు

అసత్య ప్రచారాలు వద్దు.. పార్టీ మార్పు పై పుట్టా మధు

పార్టీ మార్పు ప్రచారం పై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు స్పందించారు. తాను సొంత పనుల కోసం మాత్రమే ఢిల్లీ వచ్చానని చెప్పారు. పార్టీలు మారుతున్నా అని... కొందరు తన పై ప్రచారం చేయడం బాధాకరంగా ఉందని అన్నారు. తాను కిందిస్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని అని.. కేసీఆర్ తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని పుట్టామధు తెలిపారు. జిల్లా పరిషత్ కోసం పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. 

మంథనిలో తనకు పోటీ లేదని.. తాను భారీ మెజార్టీతో గెలవుతున్నానని పుట్టా మధు అన్నారు. తనకు వేరే పార్టీ మారే అవసరం లేదని చెప్పారు. పార్టీలో తనకు గుర్తింపు ఉందన్న ఆయన.. తన పేరు చెప్పి పంచాయతీలకు కోట్ల నిధులు విడుదల చేశారని తెలిపారు. అసలు ఢిల్లీ రావాలంటేనే భయం వేస్తోందన్నారు. సొంత పనుల కోసం ఢిల్లీ వస్తే ప్రతిష్టను దిగజార్చేలా పుకార్లు పుట్టిస్తున్నారని పుట్టా మధు ఆరోపించారు.