భూమిని కబ్జా చేశారని మాజీ ఎంపీటీసీ సూసైడ్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన

భూమిని కబ్జా చేశారని మాజీ ఎంపీటీసీ సూసైడ్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన
  • వాట్సప్‌ లో స్టేటస్‌ నోట్ పెట్టుకుని.. పురుగులు మందు తాగిండు
  • చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి
  • రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుశాపూర్ లో ఘటన

తంగళ్లపల్లి, వెలుగు: భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడ్డారని మాజీ ఎంపీటీసీ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం..  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుశాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ కరికబోయిన కుంటయ్య(50)కు గ్రామ శివారులో 7 కుంటల వ్యవసాయ భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన గంగ కృష్ణారెడ్డి తన కబ్జా చేశాడని, సోమవారం (june 16) రాత్రి వాట్సప్‌ స్టేటస్‌గా పెట్టుకుని ఎటో వెళ్లిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. 

దీంతో కుంటయ్య ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే పురుగు మందు తాగిన అతడు అపస్మారక స్థితికి చేరుకోగా సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించగా  చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. కాగా.. ‘ నా భూమిని కృష్ణారెడ్డి కబ్జా చేయడంతోపాటు, నా ఇంటి మీదికి కొట్టడానికి వచ్చాడని, అక్రమంగా కేసులు పెట్టించినట్లు, మల్యాల నాగరాజు ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపించాడు. 

నన్ను ఇబ్బందులు పెట్టినవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని  కోరాడు. ‘ జై కేటీఆర్.. జై తెలంగాణ’ అంటూ తన ఫొటో కవర్ పై సూసైడ్ నోట్ రాశాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు.