- ముఖ్యనేతలతో కలిసి శుక్రవారమే ఢిల్లీకి పయనం..
- బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్తో పాటు ఫార్వర్డ్ బ్లాక్ నేతలూ చేరిక
నల్గొండ, వెలుగు: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం కాంగ్రెస్లో చేరనున్నారు. శుక్రవారం ఆయనతోపాటు, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య పలువురు ముఖ్యనేతలు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. శనివారం పార్టీ ముఖ్యనేతల సమక్షంలో కాంగ్రెస్పార్టీలో చేరుతున్నట్టు వీరేశం తెలిపారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నా రు. అలాగే, నియోజకవర్గంలో మరికొంత మంది ముఖ్యనేతలు, ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచిన వీరేశం వర్గీయులు కూడా కాంగ్రెస్లో చేరనున్నారు. 2014 ఎన్నికల్లో నకిరేకల్లో బీఆర్ఎస్ నుంచి వీరేశం ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో ఓడిపోయారు. ఆయన మీద గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్లో చేరడంతో వీరేశాన్ని పార్టీ పక్కన పెట్టింది. దీంతో గత ఐదేండ్ల నుంచి ఆయన స్వతంత్రంగానే పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున తన క్యాండేట్లను నిలబెట్టి సత్తా చాటుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేతో రాజకీయ విభేదాలు ముదిరిపోవడంతో హైకమాండ్ వీరేశానికి ప్రాధాన్యాన్ని తగ్గించింది. ఆయన అనుచరుల పైనా పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. అయినప్పటికీ టికెట్తనకే వస్తదని ఆశించారు. కానీ సీఎం సిట్టింగ్లకే టికెట్లుకన్ఫర్మ్ చేయడంతో వీరేశం బీఆర్ఎస్కు రిజైన్ చేశారు. వచ్చే ఎన్ని కల్లో తన సత్తా చూపిస్తానని చాలెంజ్ చేశారు.
వీరేశం రాకను వ్యతిరేకించిన వెంకటరెడ్డి వర్గం
వీరేశం రాకను నకిరేకల్ కాంగ్రెస్లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ వెంకటరెడ్డి స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంలలో ఇటీవల జరిగిన మీటింగ్లో వీరేశం రాకకు మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. పైగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సపోర్ట్ కూడా ఆయనకు ఉంది. పొంగులేటితో పాటు వీరేశం పార్టీలో చేరాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకత్వాన్ని మెప్పించడానికి ఇంత టైం పట్టింది. హైదరాబాద్లో జరిగిన సోనియాగాంధీ సభలో వీరేశం చేరుతారని భావించారు. కానీ వివిధ కారణాలతో సాధ్యం కాలేదు. ఇది
అప్పుడు అనేక అపోహలకు దారితీసింది.