- రాష్ట్రపతి మాజీ ఓఎస్డీ సత్యనారాయణ సాహు
చేవెళ్ల, వెలుగు: గ్లోబర్ వార్మింగ్ కారణంగా ప్రపంచం ఇప్పటికే 51 హెచ్చరికలు ఎదుర్కోందని రాష్ట్రపతి మాజీ ఓఎస్డీ, ప్రెస్ సెక్రటరీ సత్యనారాయణ సాహు ఆందోళన వ్యక్తం చేశారు. డీకార్బనైజేషన్ పర్యావరణ చర్య కాదని, సామాజిక చర్య అని స్పష్టం చేశారు. బుధవారం చేవెళ్ల ప్రభుత్వ కాలేజీలో ఐక్యరాజ్య సమితి లక్ష్యాల్లో భాగంగా శాంతి, న్యాయం, బలమైన సంస్థలకు సంబంధించి ఎస్డీజీ 16వ జాతీయ సదస్సును ప్రారంభించారు. 94 పరిశోధనా పత్రాల సంకలనాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాంతి, న్యాయం, బలమైన సంస్థలు రాజ్యాంగం ఇచ్చిన హామీలని, వాటిని కాపాడాల్సిన బాధ్యత సమాజానికి, ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, కన్వీనర్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ మాలిక్, ప్రొఫెసర్ రాములు, ఇంగ్లిష్ విభాగం డాక్టర్ షాజహాన్ సిద్దిఖీ, ప్రొఫెసర్ కె. ముత్యంరెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

