యూపీలో ఎస్పీకి షాక్.. బీజేపీలోకి ములాయం కోడలు

యూపీలో ఎస్పీకి షాక్.. బీజేపీలోకి ములాయం కోడలు

ఉత్తర ప్రదేశ్ లో  ఎన్నికలు దగ్గర పడుతుండటంతో  రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.  వలసలు జోరందుకున్నాయి. నిన్నటి వరకు బీజేపీ నుంచి ఎస్పీ లోకి వలసలు జరుగుతుండగా..ఇవాళ ఎస్పీకి షాకిస్తూ  ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరారు.  ఢిల్లీలోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీకి ధన్యవాదాలు తెలిపిన ఆమె..ప్రధాన మోడీ పని తీరును మెచ్చుకున్నారు. ఫిబ్రవరి  నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.