ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వలసలు జోరందుకున్నాయి. నిన్నటి వరకు బీజేపీ నుంచి ఎస్పీ లోకి వలసలు జరుగుతుండగా..ఇవాళ ఎస్పీకి షాకిస్తూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీకి ధన్యవాదాలు తెలిపిన ఆమె..ప్రధాన మోడీ పని తీరును మెచ్చుకున్నారు. ఫిబ్రవరి నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Former Uttar Pradesh Chief Minister Mulayam Singh Yadav's daughter-in-law joins BJP #UttarPradeshElections2022 pic.twitter.com/ZEkd9wD2LV
— ANI (@ANI) January 19, 2022