
ముంబై: గ్లాండ్ ఫార్మాలో తన వాటాను అమ్మాలని ఫోసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొనుగోలుకు ఆసక్తి ఉన్న కొంత మంది ముందుకు రావడంతో ఈ ప్రపోజల్ను చైనా కంపెనీ పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గ్లాండ్ ఫార్మాలో ఫోసన్ ఫార్మాస్యూటికల్స్కు కంట్రోలింగ్ వాటా ఉంది. ఈ వార్త బయటకు రావడంతో గ్లాండ్ ఫార్మా షేర్లు 5.7 శాతం ఎగిశాయి. ఈ కంపెనీ షేర్లు ఇంతలా పెరగడం నెల రోజులలో ఇదే మొదటిసారి. గ్లాండ్ ఫార్మా షేర్లు ఈ ఏడాది 53 శాతం దాకా పతనమయ్యాయి. దీంతో కంపెనీ మార్కెట్ వాల్యూ 3.6 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది.
గ్లాండ్ ఫార్మాలో వాటా అమ్మకపు వార్తల నేపథ్యంలో హాంకాంగ్ ఎక్స్చేంజ్లో ఫోసన్ ఫార్మా షేర్లు 5.4 శాతం లాభపడ్డాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లాండ్ పార్మా ఇంజెక్టబుల్స్డ్రగ్స్ తయారీలో ఉంది. యాంటి బయాటిక్స్, ఆంకాలజీ, కార్డియాలజీ డ్రగ్స్ను 60 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఫోసన్ ఫార్మా 2017 లో గ్లాండ్ ఫార్మాలో 74 శాతం వాటాను 1.1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత మూడేళ్లకు గ్లాండ్ ఫార్మాను పబ్లిక్ ఇష్యూకు తీసుకెళ్లింది.