సికింద్రాబాద్, వెలుగు: గోల్డ్ బిస్కెట్ల చోరీ కేసులో నలుగురు నిందితులను మోండా మార్కెట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గత నెల 27న మోండా మార్కెట్ పాన్బజార్లోని నగల మెల్టింగ్ షాప్కు వచ్చిన కొందరు వ్యక్తులు.. ఐటీ అధికారులమని చెప్పి కిలో 700 గ్రాముల బంగారు బిస్కెట్లను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం10 మంది నిందితులు ఉండగా.. ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పట్టుబడ్డ నిందితుల్లో నలుగురు రెహ్మన్, జాకీర్, ఆకాశ్, ప్రవీణ్ను ఈ నెల 15 వరకు విచారించేందుకు సికింద్రాబాద్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నలుగురిని శుక్రవారం మోండా మార్కెట్పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరిపై గతంలో కేసులున్నాయా? వేరే ప్రాంతాల్లో ఇలాంటి దోపిడీలకు పాల్పడ్డారా?, మిగతా నిందితుల వివరాలు, చోరీకి గురైన బంగారంపై మొదటిరోజు పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.