కరీంనగర్ రూరల్, వెలుగు: కరీంనగర్ రూరల్ మండలం నగునూర్లోని సిల్వర్ స్ప్రింగ్ విల్లాస్లో కరెంట్ వైర్లు చోరీ చేసిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్రెడ్డి గురువారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. విల్లాలో సుమారు రూ.60 వేల విలువైన కరెంటు వైర్ చుట్టలను చోరీ జరిగిందని విల్లా యజమాని పోలీసులకు కంప్లైంట్ చేశారు.
గురువారం తీగలగుట్టపల్లి నుంచి ఆరెపల్లి దారిలో దొంగతనం చేసిన బొంత కుమార్, అలకుంట్ల జంపయ్య, సూర శివాజీ, సూర నవీన్ అనుమానస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు పట్టుకున్నారు. వీరిని విచారించగా కరెంట్ వైర్ల దొంగతనం ఒప్పుకొని, వైర్లు దాచిపెట్టిన ప్రాంతాన్ని పోలీసులకు చూపించడంతో స్వాధీనం చేసుకున్నారు.
