హోటల్​లో కుళ్లిపోయిన మాంసం.. రూ.8 వేల ఫైన్

హోటల్​లో కుళ్లిపోయిన మాంసం..  రూ.8 వేల ఫైన్

చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా  చెన్నూరు టౌన్​లోని సితార గ్రాండ్ హోటల్ లో గురువారం మున్సిపల్ కమిషనర్ గంగాధర్ తనిఖీ చేశారు. నాలుగు రోజుల కిందటి కుళ్లిపోయిన మాంసాన్ని నిల్వ ఉంచినట్టు గుర్తించారు. కూరల్లో వాడే పదార్థాలన్నీ ఎక్కువ రోజులుగా నిల్వ ఉంచడం వల్ల దుర్వాసన వస్తున్నాయని, అందులో ఉన్న ఏ ఒక్క పదార్థం కూడా తినేలాగా లేదని కమిషనర్​పేర్కొన్నారు. 

హోటల్ ఓనర్​కు రూ.8 వేల ఫైన్​ వేశామని తెలిపారు. ఫ్రెష్​చికెన్, మటన్​మాత్రమే వండాలని సూచించారు. లేకుంటే హోటల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో శానిటరీ ఇన్​స్పెక్టర్​కుమార్, ఎన్విరాన్ మెంట్ ఇంజినీర్  పి.హరికాంత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.