జులైలో పవన్,సాయి ధరమ్.. ఆగస్టులో చిరు, వరుణ్.. మధ్యలో వైష్ణవ్

జులైలో పవన్,సాయి ధరమ్.. ఆగస్టులో చిరు, వరుణ్.. మధ్యలో  వైష్ణవ్

రెండు నెలల గ్యాప్ లో నలుగురు మెగా హీరోల నుండి నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. దాదాపు నెల రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర మెగా హీరోల సందడే కనబడనుంది. ఈ సందడిని ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), సాయి ధరమ్ తేజ్(Sai dharam tej)  మొదలుపెట్టనున్నారు.

ఈ కాంబోలో వస్తున్న మూవీ "బ్రో(Bro)". తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని(Samutirakhani) తెరకెక్కిస్తున్న ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ టీజర్ కు ఆడియన్స్ నుండి మెయిన్ గా పవన్ ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

ఈ సినిమా తరువాత ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi ) హీరోగా చేస్తున్న భోళా శంకర్(Bhola shankar) ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహర్ రమేష్(Meher Ramesh) తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం.. చిరు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య(Vaalteru veerayya) వంటి బ్లాక్ బస్టర్ తరువాత చిరు నుండి వస్తున్న సినిమా కావడంతో.. భోళా శంకర్ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ఆ తరువాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్(Vaishnav tej ) ఆదికేశవ(Aadi keshava) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి(Srikanth reddy) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా విజయం వైష్ణవ్ తేజ్ కు చాలా అవసరం.  

వైష్ణవ తేజ్ తరువాత మెగా అభిమానులను అలరించేందుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varuntej) రానున్నారు. వరుణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ గాండీవధారి అర్జున(Gaandeevadhari Arjuna). స్టైలీష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు(Praveen sattaaru) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతకొంత కాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న వరుణ్ ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. 

మరి నెల రోజుల గ్యాప్ లో బాక్సాఫీస్ వార్ కు సిద్దమైన నలుగురు మెగా హీరోలలో.. ఎవరు హిట్ అందుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.