కరోనా కాటు.. లాయర్ ఫ్యామిలీలో నలుగురు మృతి

కరోనా కాటు.. లాయర్ ఫ్యామిలీలో నలుగురు మృతి

కరోనా  విజయవాడకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో నలుగురిని బలి తీసుకుంది. ఓ ప్రముఖ న్యాయవాది తల్లి అక్టోబర్ 8వ తేదీన కరోనాతో చనిపోయింది. అక్టోబర్ 30వ తేదీన న్యాయవాది భార్య మరణించింది. భార్య అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే లాయర్ కూడా చనిపోయారు. ఈ ముగ్గురు కూడా కరోనాతో చనిపోయినట్టు డాక్టర్లు తేల్చారు. వైరస్ సోకడంతో న్యాయవాది కొడుకు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం నాడు చనిపోయాడు. ఇలా.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కరోనాతో మరణించడంతో బంధుమిత్రులు కన్నీరు పెడుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది.

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం