శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గార మండలం బైరి జంక్షన్ వద్ద ఆటో, బైక్ ఢీకొన్నాయి. దాంతో ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పతికి తరలించారు. మృతులు సరుబుజ్జులి మండలం కొత్తపేట వాసులుగా పోలీసులు గుర్తించారు.
For More News..