
ఇద్దరు కూలీలు కూడా చనిపోయారు
ఏడుగురికి తీవ్ర గాయాలు..
హైపోథెర్మియాతో ఆరుగురి పరిస్థితి విషమం
ప్రపంచంలోనే అత్యం త ఎత్తైన సైనిక ప్రాంతం సియాచిన్ గ్లేసి యర్ వద్ద సోమవారం జరిగిన ప్రమాదంలో నలుగురు జవార్లు దుర్మరణం చెందారు. ఇద్దరు కూలీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. భూమికి 18 వేల అడుగుల ఎత్తులో ఉత్తర గ్లేసియర్
వద్ద గస్తీ తిరుగుతున్న సమయంలో ఆర్మీ ట్రూప్ పై హిమపాతం విరుచుకుపడింది. భారీ మంచుచరియలు మీదపడటంతో నలుగురు జవాన్లు, ఇద్దరు కూలీలు అక్కడి క్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయాలపాలై పూర్తిగా మంచులో కూరుకుపోయిన మరో ఏడుగురిని రెస్క్యూ టీమ్ బయటికి తీశారు. గస్తీ ట్రూప్ లో సైనికులతోపాటు వాళ్లకు సహాయంగా వెళ్లిన కూలీలు కూడా ఉన్నారని, మధ్యాహ్నం సుమారు 3:30 గంటలకు సడెన్ గా హిమపాతం రావడంతో తప్పించుకునే దారిలేక ప్రమాదంలో చిక్కుకుపోయారని ఆర్మీ వర్గాలు తెలిపినట్లు పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది. సమాచారం తెలిసిన వెంటనే బేస్ క్యాంపు నుం చి హెలికాప్టర్ అంబులెన్స్, రెస్క్యూ టీమ్ బయల్దేరి వెళ్లాయి.
ఆరుగురి పరిస్థితి సీరియస్
నలుగురు జవాన్లు, ఇద్దరు కూలీలు చనిపోగా, గాయపడ్డవాళ్లలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వాళ్లను మిలిట్రీ హాస్పిటల్ కు తరలించామని ఆఫీసర్లు తెలిపారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సియాచిన్ లో చివరిసారి 2016 ఫిబ్రవరిలో ఇలాంటి ప్రమాదమే జరిగి మద్రాస్ రెజిమెంట్కు చెం దిన పది మంది జవాన్లు మంచులో కూరుకుపోయారు. అప్పటి ఘటనలో లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ ఒక్కడినే కాపాడగలిగినా , హైపోథెర్మియా కారణంగా ఎనిమిది రోజుల తర్వా త ఆయన ప్రాణాలు వదిలారు.