హబ్సిగూడలో నలుగురు స్టూడెంట్స్ అదృశ్యం

హబ్సిగూడలో నలుగురు స్టూడెంట్స్ అదృశ్యం

స్టూడెంట్స్​అదృశ్యమైన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు 5న జరగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  హబ్సిగూడలోని శ్రీ సాయి పబ్లిక్​ స్కూల్​లో ఆరో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు ఉదయం బడికి వెళ్లారు. 

ఇదే క్రమంలో వారు స్కూల్​ బయటకి వెళ్లారు. అప్పటి నుంచి వారి ఆచూకీ లభ్యం కావట్లేదు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్​ వద్దకు చేరుకున్నారు. స్కూల్​ మేనేజ్​మెంట్ ని పిల్లల విషయంలో ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని పేరెంట్స్​ ఆరోపిస్తున్నారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పోలీస్​స్టేషన్​లో కంప్లెంట్​ చేశారు.