స్టూడెంట్స్అదృశ్యమైన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు 5న జరగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హబ్సిగూడలోని శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు ఉదయం బడికి వెళ్లారు.
ఇదే క్రమంలో వారు స్కూల్ బయటకి వెళ్లారు. అప్పటి నుంచి వారి ఆచూకీ లభ్యం కావట్లేదు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. స్కూల్ మేనేజ్మెంట్ ని పిల్లల విషయంలో ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో కంప్లెంట్ చేశారు.