జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. పూంచ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. 2023 జూలై 17 సోమవారం రాత్రి నుంచి సూరంకోట్ బెల్ట్ లోని సింధారా ఏరియాలో ఆర్మీ, పోలీసులు సంయూక్తంగా ఆపరేషన్ చేపట్టారు.
అటవీ ప్రాంతంలో కొనసాగినకాల్పుల్లో నలుగురు టెర్రరిస్టులు హతమైనట్లు జమ్మూజోన్ ఏడీజీపీ తెలిపారు. అమర్ నాథ్ యాత్ర కొనసాగుతున్న సమయంలో భద్రతాదళాలు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. హతమైన ఉగ్రవాదుల నుంచి నాలుగు ఏకే-47 రైఫిళ్లు, రెండు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నట్లు భారత సైన్యం వెల్లడించింది.
ALSO READ :బీఆర్ఎస్ సెల్ఫ్గోల్.. తప్పుడు వివరాలపై స్థానికుల విస్మయం
వారంతా విదేశీ ఉగ్రవాదులేనని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు సోదాలు కొనసాగిస్తున్నాయి.