బీఆర్ఎస్ ​సెల్ఫ్​గోల్.. తప్పుడు వివరాలపై స్థానికుల విస్మయం

బీఆర్ఎస్ ​సెల్ఫ్​గోల్.. తప్పుడు వివరాలపై స్థానికుల విస్మయం

=కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్​తన హయాంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ఆయా స్కీమ్​ల ద్వారా ఎంత మందికి లబ్ధి చేకూరిందనే దానిపై కామారెడ్డి నియోజక వర్గంలో  ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ స్కీమ్​ల ద్వారా ఎంత మంది లబ్ధిదారులకు ఎంత అమౌంట్​ఖర్చు చేశామనే వివరాల్ని ఇందులో  పొందుపరుస్తున్నారు. వీటిల్లో పేర్కొనే వివరాల్లో కొన్ని చోట్ల తప్పుడు సమాచారం ఉండడంతో స్థానికులు విస్మయం చెందుతున్నారు.

ALSO READ :పేదల కడుపు నింపేందుకే ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ : దొడ్డా కృష్ణయ్య

దోమకొండ మండలం గొట్టిముక్లలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలో 11 మందికి గొర్రెల పంపిణీ  చేశామని ఇందుకు రూ.10,31,250  ఖర్చు చేసినట్లు చూపారు. వాస్తవానికి ఈ ఊరిలో గొల్ల, కుర్మ వాళ్లు ఏవరూ లేరు. భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లిలో  రైతు బీమా ద్వారా 12 మంది లబ్ధిదారులకు మేలు జరిగిందని పేర్కొంటూ ప్లెక్సీలో  పేర్కొనగా, వాస్తవానికి ఈ స్కీమ్​ద్వారా ఇక్కడ ఒకరికే లబ్ధి చేకూరిందని స్థానికులు చెబుతున్నారు. రాజంపేట మండలం తలమడ్ల గొల్ల, కుర్మలు లేకున్నా,14 మందికి గొర్రెల యూనిట్ల పంపిణీ కింద రూ.13,12,500 ఖర్చు చేసినట్లు చూపారు.