హైదరాబాద్, వెలుగు : బ్రాండ్లకు ఫ్రాంచైజ్లను ఏర్పాటు చేయడంలో సాయపడే ఫ్రాంచైజ్ బ్రిగేడ్ హైదరాబాద్లోని తాజ్కృష్ణలో ప్రీమియర్ మల్టీసిటీ ఫ్రాంచైజ్ ఎక్స్పోను నిర్వహించింది. క్రోమా, చాయ్ పాయింట్, వీఓసీ, బిగ్గీస్ బర్గర్, గ్రిడ్ ఇండియా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి బ్రాండ్లతో పార్టనర్షిప్ కుదుర్చుకున్నామని కంపెనీ సీఈఓ ప్రవీణ్ పేర్కొన్నారు. సక్సెస్ఫుల్గా దేశం మొత్తం మీద 1,500 ఫ్రాంచైజ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. బ్రాండ్లకు ఫ్రాంచైజ్ స్టోర్లు వంటివి ఏర్పాటు చేయాలనుకునే వారికి ఈ కంపెనీ సాయం చేస్తుంది.