
- తెలంగాణ ఔట్ డోర్, మీడియా ఓనర్స్ అసోసియేషన్
పంజాగుట్ట, వెలుగు : గత బీఆర్ఎస్పాలకులు తమ పొట్టలు కొట్టి ఇబ్బందులు పెట్టారని తెలంగాణ ఔట్ డోర్, మీడియా ఓనర్స్ అసోసియేషన్(టుమో) ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెసులుబాటు వచ్చిందని తెలిపింది. అందరికి సమన్యాయం పాటించాలని సంఘం అధ్యక్షుడు ఇఫ్తికార్,జనరల్ సెక్రటరీ రమేష్,జాయింట్సెక్రటరీ విష్ణు కోరారు.
అసోసియేషన్ వార్షిక సమావేశం మంగళవారం హోటల్హరిత ప్లాజాలో జరిగింది. అడ్వర్టైజింగ్హోర్డింగ్స్కు కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన పాలసీ ద్వారా సమన్యాయం పాటించాలని కోరారు. ఈ సమావేశంలో కోశాధికారి రవికాంత్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.