మా పొట్టలు కొట్టిన బీఆర్ఎస్ పాలకులు

మా పొట్టలు కొట్టిన బీఆర్ఎస్ పాలకులు
  •     తెలంగాణ ఔట్ డోర్, మీడియా ఓనర్స్​ అసోసియేషన్​

పంజాగుట్ట, వెలుగు : గత బీఆర్ఎస్​పాలకులు తమ పొట్టలు కొట్టి ఇబ్బందులు పెట్టారని తెలంగాణ ఔట్ డోర్, మీడియా ఓనర్స్​ అసోసియేషన్​(టుమో) ఆరోపించింది. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెసులుబాటు వచ్చిందని తెలిపింది. అందరికి సమన్యాయం పాటించాలని సంఘం అధ్యక్షుడు ఇఫ్తికార్,జనరల్​ సెక్రటరీ రమేష్​,జాయింట్​సెక్రటరీ విష్ణు కోరారు.

అసోసియేషన్ వార్షిక సమావేశం మంగళవారం హోటల్​హరిత ప్లాజాలో జరిగింది. అడ్వర్టైజింగ్​హోర్డింగ్స్​కు కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన పాలసీ ద్వారా సమన్యాయం పాటించాలని కోరారు. ఈ సమావేశంలో కోశాధికారి రవికాంత్​, ఇతర సభ్యులు పాల్గొన్నారు.