హైదరాబాద్(ఎల్బీనగర్), వెలుగు: ఫేస్బుక్ నోటిఫికేషన్తో రూ.41.98లక్షలు కొట్టేసిన మధ్యప్రదేశ్కు చెందిన ఆదిత్యనారాయణ్గాడ్బోలేను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్చేశారు. రూ.11.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సిటీలోని నాగోల్కు చెందిన వ్యక్తికి ఫారెక్స్ ట్రేడింగ్ అనే నకిలీ యాప్నుంచి పెట్టుబడికి డబుల్ ప్రాఫిట్ వస్తుందని ఫేస్బుక్ నోటిఫికేషన్ వచ్చింది. క్లిక్చేసి డీటెయిల్స్ ఎంటర్ చేశాడు. డిసెంబర్1 నుంచి17 వరకు రూ.41.98 లక్షలు ట్రాన్స్ఫర్చేశాడు. ఆ తర్వాత అవతలి వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్లేకపోవడంతో బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్చేశాడు. విచారణలో ఇండోర్కు చెందిన ఆదిత్య నారాయణ్ గోడ్బోలే ప్రధాన నిందితుడని పోలీసులు గుర్తించారు. ఫారెక్స్ ట్రేడింగ్ యాప్ నుచైనాకు చెందిన మౌజిబిన్ తయారు చేయగా, ఇండియాలో ఆదిత్య రన్చేస్తున్నట్లు తెలిసింది. ఆదిత్య గతంలో ఎంబీబీఎస్ చేసేందుకు చైనా వెళ్లివచ్చాడు.
For More News..