దివ్యాంగులకు ఫ్రీ బస్‌ పాస్ క్యాంప్

దివ్యాంగులకు ఫ్రీ బస్‌ పాస్ క్యాంప్
  • రాణిగంజ్​ డిపో మేనేజర్ లక్ష్మి ధర్మ

సికింద్రాబాద్, వెలుగు: ​రాణిగంజ్​డిపోలో ఈనెల 31న దివ్యాంగుల ఫ్రీ బస్​పాస్​ క్యాంప్  నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్​లక్ష్మి ధర్మ తెలిపారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారికి ఫ్రీ బస్‌ పాస్ క్యాంప్  బోయిన్​పల్లి ఎన్ఐఎంహెచ్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 

ఓల్డ్ బోయిన్‌పల్లి, మల్లికార్జున్ నగర్, హస్మత్ పేట్, దుబాయ్ గేట్, మహాత్మా నగర్, బాపూజీ నగర్, ఎన్ఐఎన్ హెచ్, బోయిన్‌పల్లి మార్కెట్, సిక్ విలేజ్, డైమండ్ పాయింట్, సెంటర్ పాయింట్, తాడుబండ్, సమంతా నగర్, గ్రీన్ ఫీల్డ్ కాలనీ  ప్రాంతాల్లోని దివ్యాంగులు క్యాంప్​కు వ చ్చి  ఫ్రీ పాసులు తీసుకోవాలని సూచించారు.