- ఈ విషయాన్ని ఎమ్మెల్యే మాధవరం గుర్తించాలి
హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల ఎఫ్టీఎల్ఒక్కసారి ఫిక్సయితే మారవన, సున్నం చెరువు ఎఫ్టీఎల్పరిధిని 2014లోనే నిర్ణయించారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. సున్నం చెరువు వద్ద కొందరికి లబ్ధి చేకూర్చాలని 5 ఎకరాలను మినహాయించి ఫెన్సింగ్వేశారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలు సరికాదన్నారు. ఆ చెరువు దగ్గర ప్రభుత్వ భూమిని కలిపి గతంలో ఫెన్సింగ్ వేసి ఉంటారని, చెరువు ఎఫ్టీఎల్కు ఇది వర్తించదన్నారు.
ఒకవేళ ఎమ్మెల్యే ఆరోపణలు చేసినట్టు చెరువు దగ్గర ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకుని పార్కులు, ప్లే ఏరియాలు ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో హైడ్రా చర్యలను అభినందించడమే కాకాకుండా సహకరించిన ఎమ్మెల్యే మాధవరం అకస్మాత్తుగా హైడ్రాపై విమర్శలకు దిగడం వెనుక కారణాలేంటో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటివరకు హైడ్రా1240 చోట్ల ఆక్రమణలు తొలగించి 1310 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందన్నారు. ఇందులో బడాబాబులుగా చెలామణి అవుతున్న వారే ఎక్కువ మంది ఉన్నారన్నారు.
శేరిలింగంపల్లి లో చెరువుల పరిశీలన
చందానగర్ : గంగారంలోని పెద్ద చెరువు, మదీనగూడ ఈర్ల చెరువును హైడ్రా కమిషనర్ బుధవారం పరిశీలించారు. హైడ్రా రెండో విడత చేపడుతున్న 14 చెరువుల్లో ఈ రెండూ ఉన్నాయన్నారు. 111 ఎకరాల గంగారం చెరువు , 32 ఎకరాల్లో ఉన్న ఈర్ల చెరువుల ఎఫ్టీఎల్ పరిధి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గవద్దన్నారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య ఉన్నారు.
