
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కోసం హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు అనూహ్య స్పందన వస్తున్నది. సోమవారం (అక్టోబర్ 06) వరకు 25 రోజుల్లో 15 వేల కాల్స్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇందులో ఆధార్ అప్డేట్ ఇష్యూస్పై 1500 కాల్స్, బ్యాంకుల్లో ప్రభుత్వ సాయం ఆలస్యంపై వెయ్యి, జియో ట్యాగింగ్ సమస్యలపై 600, హౌసింగ్ ఈఈల వద్ద పెండింగ్ అంశాలపై వెయ్యి కాల్స్, ఇందిరమ్మ ఇంటి కోసం 3,500 మంది ఫోన్లు చేశారు. గవర్నమెంట్వర్కింగ్ డేస్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది.