
కాంగ్రెస్ పార్టీ తరపున పెద్దపల్లి లోక్ సభ నుంచి గెలుపొందిన గడ్డం వంశీ కృష్ణ పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణం చేశారు. 2024, జూన్ 25వ తేదీన లోక్ సభలో జరిగిన కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారంలో.. ఎంపీగా తన ప్రమాణం పూర్తి చేశారు వంశీ కృష్ణ. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. ఇవాళ అంటే జూన్ 25, 2024 నాడు తెలంగాణ ఎంపీలు సహా మిగిలిన 264 మంది ప్రమాణం చేయనున్నారు.
జూన్ 26న స్పీకర్ ఎన్నిక, 27న ఉభయ సభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. 28 నుంచి చర్చలు ప్రారంభం అవుతాయి. జులై 2 లేదా 3న ఎంపీల ప్రశ్నలకు మోదీ జవాబులిస్తారు. తర్వాత ఉభయ సభల వాయిదా పడే అవకాశాలున్నాయి. కేంద్ర బడ్జెట్ కోసం జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం.