
- కాంగ్రెస్ నేత గజ్జల కాంతం ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో డ్రగ్స్ సృష్టికర్త కేటీఆరేనని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ఆరోపించారు. డ్రగ్స్ కాంట్రాక్టు తీసుకొని పదేండ్లలో పదివేల కోట్ల విలువజేసే డ్రగ్స్ రాష్ట్రంలో సప్లయ్ చేశారని అన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. వెయ్యి మందిని పెట్టుకొని గ్రామాలకు, మండలాలకు డ్రగ్స్ సరఫరా చేసి, ఎస్సీ.. ఎస్టీ కుటుంబాలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
కాలేజీ యువతకు డ్రగ్స్ అలవాటు చేసిందే కేటీఆర్ అని అన్నారు. సినీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన యాక్టర్లకు డ్రగ్స్ అలవాటు చేశారని, వినని వారిపై కేసులు పెట్టి బెదిరించారని ఆరోపించారు. భార్యాభర్తల ఫోన్లు ట్యాపింగ్ చేసిన దుర్మార్గులు కేసీఆర్, కేటీఆర్ అని దుయ్యబట్టారు.