కేసీఆర్‌‌‌‌, హరీశ్‌‌పై చర్యలు తీసుకోవాలి

 కేసీఆర్‌‌‌‌, హరీశ్‌‌పై చర్యలు తీసుకోవాలి
  • పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం డిమాండ్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు అప్పగించారని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. సీబీఐ విచారణ చేపట్టి బాధ్యులైన కేసీఆర్, హరీశ్​ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం గాంధీ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, హరీశ్​ రావు దోచుకున్నారని కవితనే వెల్లడించారని గుర్తుచేశారు. అవినీతి నుంచి కేసీఆర్, కేటీఆర్‌‌‌‌ను తప్పించాలని కవిత చూస్తున్నారని, అందుకే హరీశ్‌‌రావు పేరు మాత్రమే చెప్తున్నారన్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని, వాళ్లు దోచుకోవటానికే పార్టీ పెట్టారని, తెలంగాణ కోసం కాదని ఆరోపించారు.