- కుమ్మెర ఘటనలో బాధిత దంపతులను డీఎస్పీకి అప్పగించిన విశారదన్ మహారాజ్
నాగర్ కర్నూల్, వెలుగు: కుమ్మెర బాధితులకు న్యాయం జరిగేంత వరకు డీఎస్పీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ సంఘాలు పోరాడుతాయని డీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ తెలిపారు. శుక్రవారం రాత్రి గణేశ్, మౌనిక దంపతులను నాగర్కర్నూల్ డీఎస్పీ బి.శ్రీనివాస్కు అప్పగించారు. కుమ్మెర గ్రామంలో బాధిత దంపతులు పని చేసుకుని జీవించే వాతావరణం కల్పించాలని కోరారు.
పసిపాపను కోల్పోయిన గణేశ్, మౌనిక దంపతులకు న్యాయం చేయాలని హైదరాబాద్లో వివిధ దశల్లో ఆందోళనలు చేశామని తెలిపారు. ఘటనకు కారణమైన 8 మందిలో ఐదుగురిని మాత్రమే అరెస్ట్ చేశారని, మిగిలిన ముగ్గురిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. గణేశ్ ఫ్యామిలీకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని పేర్కొన్నారు.
పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. గణేశ్, మౌనికకు భద్రత కల్పిస్తామని చెప్పారు. డీఎస్పీ, ప్రజాసంఘాల నాయకులతో పాటు బీసీ జేఎసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ శ్రావణి పాల్గొన్నారు.
