గణేష్ మండపం నిర్వాహకుల నిర్లక్ష్యం.. కరెంట్ షాక్ తో బాలుడి మృతి 

గణేష్ మండపం నిర్వాహకుల నిర్లక్ష్యం.. కరెంట్ షాక్ తో బాలుడి మృతి 
  • జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన

హైదరాబాద్: గణేష్ మండపం నిర్వాహకుల నిర్లక్ష్యం.. అభం.. శుభం ఎరుగని ఓ ఐదేళ్ల బాలుడి నిండు ప్రాణాలను బలిగొంది. జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లో  సోమవారం జరిగిన ఘటన విషాదం రేపింది. 
జీడిమెట్ల షాపూర్ నగర్ సమీపంలోని ఎన్ఎల్బీ నగర్ లో మల్లేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తన వద్దే ఉంటున్నబావ మరిది కుమారుడు ఐదేళ్ల  అనిల్ అలియాస్ అభి ఇవాళ ఉదయం సంతోషి మాత ఆలయంలో ప్రతిష్టించిన గణేష్ మండపం వద్ద ఆడుకంటున్నాడు. అయితే గణేష్ మండపం కోసం వేసిన సీరియల్ లైట్స్ వైర్ తెగి పడి ఉండటంతో తెలియక కరెంటు వైర్ ను పట్టుకోవడంతో... కరెంటు షాక్ కొట్టడంతో అక్కడికక్కడే సృహ కోల్పోయాడు. వెంటనే అనిల్ ను ‌స్థానిక మెడ్విజన్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. కరెంటు వైర్లు ఓపెన్ గా పెట్టి నిర్లక్ష్యం వహించిన గణేష్ మండపం నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాలుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.