హైదరాబాద్లో వర్షంలోనే కొనసాగుతోన్న గణేష్ నిమజ్జనం

హైదరాబాద్లో వర్షంలోనే  కొనసాగుతోన్న గణేష్ నిమజ్జనం

 హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. సికింద్రాబాద్, రెజిమెంటల్ బజార్,మోండా మార్కెట్,రాణిగంజ్, మారేడ్ పల్లి,బేగంపేట,బోయిన్ పల్లి,అడ్డగుట్ట,తాపల్ మండి తోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. అబిడ్స్ , కోఠి , బషీర్ బాగ్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. 

మరో వైపు   వర్షం కురుస్తున్నప్పటికీ నిమజ్జన శోభ యాత్ర కొనసాగుతోంది. వర్షంలో తడుస్తూ ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనానికి తరలి వస్తున్నాయి గణనాథులు. భక్తులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.   బషీర్ బాగ్ నుంచి నిమజ్జన కోసం సాగర్ కు గణనాథులు తరలి వెళుతున్నాయి. 

శోభాయాత్రకు  భక్తుల పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వర్షం తాకిడికి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను  చూసుకుంటున్నారు. ఏకధాటిగా వాన పడుతున్న డప్పు సప్పులు, నృత్యాలు చేస్తూ... నిమజ్జనాన్ని కొనసాగిస్తున్నారు. విభిన్న రకాల వినాయకుల భక్తులకు విశేషంగా ఆకట్టుకున్నాయి.