వేలి సర్జరీ కోసం వెళ్లి మహిళ మృతి...వైద్యం వికటించడం వల్లేనంటున్న కుటుంబసభ్యులు...

వేలి సర్జరీ కోసం వెళ్లి మహిళ మృతి...వైద్యం వికటించడం వల్లేనంటున్న కుటుంబసభ్యులు...
  • ప్రైవేట్​ ఆస్పత్రి ఎదుట ధర్నా

అల్వాల్, వెలుగు: మేడ్చల్ జిల్లా అల్వాల్​కు చెందిన ఓ మహిళ మృతిచెందింది. అయితే, వైద్యం వికటించడం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. ప్రైవేట్​ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. అల్వాల్ సిటిజన్ కాలనీకి చెందిన ప్రభావతి(45) వేలికి గాయమై, రక్తం గడ్డ కట్టడంతో సర్జరీ కోసం ఈ నెల 4న స్థానిక ఎక్సెల్ ఆస్పత్రిలో చేరారు. తర్వాత ఆమెకు బీపీ ఎక్కువగా ఉందని డాక్టర్లు ఇంజెక్షన్ ఇచ్చారు. 

కాసేపటికే ప్రభావతి ఆరోగ్యం విషమించింది. వైద్యుల సూచనతో కుటుంబసభ్యులు వెల్​నెస్ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. 

డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రభావతి చనిపోయిందంటూ కుటుంబీకులు శుక్రవారం ఎక్సెల్​హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ 
చేపట్టారు.