
గణేష్ నవరాత్రుల సందర్భంగా భక్తులు గణేషుడిని ఒక్కో చోట ఒక్కో రూపంలో పూజిస్తూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. డబ్బులతో ఒకరు.. కూరగాయాలతో మరొకరు..చాక్లెట్ తో ఇంకొకరు ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు వినాయకుడి ప్రతిమను రకరకాలుగా వైరైటీ, ఆకట్టుకునేలా తయారు చేసి, పూజిస్తున్నారు. వినాయకుడికి ఇష్టమైన వంటకాలను నైవేద్యం పెడుతూ.. అన్నదాన కార్యక్రమాలు, వివిధ కల్చరల్ ప్రొగ్రామ్ లతో ఎంటర్ టైన్ చేస్తూ.. గణేషుడి ఆశీర్వాదం పొందుతున్నారు..
అయితే ఇక్కడ ఓ భక్తుడు అందరిని ఆకట్టుకునేలా ఆధునిక టెక్నాలజీతో టెక్ వినాయకుడిని తయారు చేసి పూజలు చేస్తున్నారు.. ఈ వినాయకుడి ప్రత్యేకత ఏమిటంటే.. దర్శనానికి వచ్చిన భక్తులకు బొట్టు పెట్టి మరీ ఆశీర్వదిస్తోంది.. ఆ టెక్ వినాయకుడి విశేషాలేంటో చూద్దాం..
ALSO READ : మోదీ ఫోన్ చేసి బైక్ ఆపమంటే ఆపుతా.. విమెన్ బైకర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ లోని చప్పల్ బజార్ లో ఈ టెక్ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. టెక్నాలజీ సాయంతో ఓ చెత్తో బొట్టు పెడుతూ, మరో చేత్తో గంట కొట్టేలా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అంతేకాదు తొండం నుంచి తీర్థం కూడా ఇస్తున్నారు ఈ గణనాథుడు. దర్శనానికి వచ్చిన భక్తులను బొట్టు పెట్టి, తీర్థం ఇస్తూ ఆశీర్వదిస్తున్న ఈ గణేషుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Video from Ravi pic.twitter.com/9uIc8MrAOm
— ravi (@risingsun143) September 25, 2023