ఆగ‌స్టు 15 వ‌ర‌కు గంగోత్రి ఆల‌యం మూసివేత

ఆగ‌స్టు 15 వ‌ర‌కు గంగోత్రి ఆల‌యం మూసివేత

కరోనా వైరస్‌ వ్యాప్తి  కారణంగా ప్ర‌ముఖ గంగోత్రి ఆల‌యాన్ని ఆగ‌స్టు 15 వ‌ర‌కు మూసివేయ‌నున్నారు. దీనికి సంబంధించి గంగోత్రి ఆల‌యం స‌మితి అధ్య‌క్షుడు సురేష్ సెమ్వాల్ తెలిపారు. గంగోత్రి ధామ్‌కి వ‌చ్చే భక్తులను 2 కిలోమీట‌ర్ల అవ‌త‌లే ఆపేస్తామన్నారు. ఉత్త‌రాఖండ్‌లోని ప్ర‌ముఖ య‌మునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్ ఆల‌యాల‌ను చార్‌ధామ్ అంటారు. ప్ర‌తి ఏటా ల‌క్ష‌లాది మంది భ‌క్తులు చార్‌ధామ్ యాత్ర చేస్తుంటారు. య‌మునోత్రి నుంచి మొద‌ల‌య్యే ఈ యాత్ర గంగోత్రి, కేదార్‌నాథ్ మీదుగా సాగి బ‌ద్రీనాథ్ ఆల‌యం సంద‌ర్శ‌న‌తో ముగుస్తుంది. క‌రోనా తో కొంత కాలంపాటు నిలిచిపోయిన చార్‌ధామ్ యాత్ర‌ను ఇటీవ‌ల ప్రారంభించారు. అయితే ఈ యాత్ర‌కు వెళ్లే భ‌క్తులు ఐసీఎంఆర్ అనుమ‌తి ఉన్న ల్యాబ్ నుంచి క‌రోనా ప‌రీక్ష చేయించుకుని ఆ రిపోర్టుతో ఈ పాస్ కోసం ఆన్‌లైన్‌లో న‌మోదు చేసుకోవాల‌ని అధికారులు తెలిపారు.