గ్యాంగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ గోదావరి మూవీ మే 17న విడుదల

గ్యాంగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ గోదావరి మూవీ మే 17న విడుదల

‘గామి’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేన్.. మే నెలలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అతను లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ గోదావరి’. శనివారం రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశారు. మే 17న విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. నేహాశెట్టి  ఇందులో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అంజలి కీలకపాత్ర పోషిస్తోంది. 1960 నాటి గోదావరి జిల్లాల నేపథ్యంలో రూపొందిస్తున్నారు. 

చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన పాత్రలో విశ్వక్ నటిస్తున్నాడు. నిజానికి గత ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, అనుకోని కారణాలతో ఆలస్యమైంది. ఆ తర్వాత మార్చి 8న విడుదల అని ప్రకటించారు. కానీ ఆ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘గామి’ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రావడంతో మేలో రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమర్పణలో సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫార్చ్యూన్ ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.