భద్రాచలం, వెలుగు : ఒడిశాలోని మల్కన్గిరి నుంచి 50.04 కిలోల ఎండు గంజాయిని కారులో కేరళలోని తిరువనంతపురానికి తరలిస్తుండగా భద్రాద్రి పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ఎక్సైజ్ ఎస్ఐ శ్రీహరి తెలిపిన ప్రకారం.. కేరళకు చెందిన అక్షయ్సురేశ్, కుంజుమన్ సురేంద్రన్ మినిమోల్, అనంత కృష్ణన్ కారులో ఎండు గంజాయిని తరలిస్తున్నారు. భద్రాచలం- పరిధి కూనవరం రోడ్డులో బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటుగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేయగా గంజాయి లభించింది. ముగ్గురు నుంచి కారు, 4 సెల్ఫోన్లు, రూ.17 వేల నగదు, రూ.28.70 లక్షల విలువైన 50.4 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను భద్రాచలం ఎక్సైజ్ పోలీస్స్టేషన్ లో అప్పగించినట్లు ఎక్సైజ్ ఎస్ఐ తెలిపారు.
