
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లిలోని ఐడీఎల్(గల్ఫ్ఆయిల్కార్పొరేషన్)లో సోమవారం సాయంత్రం గ్యాస్కట్టర్ సిలిండర్పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్పాట్లోనే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యూపీకి చెందిన ఎండీ మోబిన్(34), జమీల్అహ్మద్(27) జీడిమెట్ల పరిధిలోని సుభాశ్నగర్లో నివసిస్తున్నారు. వీరు ఎర్రగడ్డలోని జీషాన్ట్రేడర్స్స్ర్కాప్కాంట్రాక్టర్ఇంతియాజ్వద్ద లేబర్గా పని చేస్తున్నారు.
సోమవారం సాయంత్రం కూకట్పల్లిలోని ఐడీఎల్ కంపెనీలో ఉన్న ఐరన్ స్క్రాప్ను తీసుకువెళ్లడం కోసం గ్యాస్ కట్టర్తో కట్ చేస్తున్నారు. ప్రమాదవశాత్తు గ్యాస్కట్టర్సిలిండర్పేలడంతో మోబిన్స్పాట్లో మృతి చెందాడు. తీవ్ర గాయాలతో జమీల్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కూకట్పల్లి పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.