ఐడీఎల్ కంపెనీలో పేలుడు .. వ్యక్తి స్పాట్డెడ్.. మరొకరికి తీవ్ర గాయాలు

ఐడీఎల్ కంపెనీలో పేలుడు .. వ్యక్తి స్పాట్డెడ్.. మరొకరికి తీవ్ర గాయాలు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లిలోని ఐడీఎల్​(గల్ఫ్​ఆయిల్​కార్పొరేషన్​)లో సోమవారం సాయంత్రం గ్యాస్​కట్టర్​ సిలిండర్​పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి స్పాట్​లోనే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యూపీకి చెందిన ఎండీ మోబిన్​(34), జమీల్​అహ్మద్​(27) జీడిమెట్ల పరిధిలోని సుభాశ్​నగర్​లో నివసిస్తున్నారు. వీరు ఎర్రగడ్డలోని జీషాన్​ట్రేడర్స్​స్ర్కాప్​కాంట్రాక్టర్​ఇంతియాజ్​వద్ద లేబర్​గా పని చేస్తున్నారు. 

సోమవారం సాయంత్రం కూకట్​పల్లిలోని ఐడీఎల్​ కంపెనీలో ఉన్న ఐరన్​ స్క్రాప్​ను తీసుకువెళ్లడం కోసం గ్యాస్​ కట్టర్​తో కట్​ చేస్తున్నారు. ప్రమాదవశాత్తు గ్యాస్​కట్టర్​సిలిండర్​పేలడంతో మోబిన్​స్పాట్​లో మృతి చెందాడు. తీవ్ర గాయాలతో జమీల్​ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కూకట్​పల్లి పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.