యుద్ధాన్ని ఆపం.. గాజాపై దాడులు కొనసాగుతాయ్

యుద్ధాన్ని ఆపం.. గాజాపై దాడులు కొనసాగుతాయ్

జెరూసలేం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ దాడులతో గాజాలో తీవ్ర విధ్వంసం రేగింది. ఈ నేపథ్యంలో ఘర్షణలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇప్పట్లో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని, గాజా మీద తమ వాయు సేన దాడుల్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పాలస్తీనా మిలిటెంట్లే యుద్ధాన్ని ఆరంభించారు అని, తాము కాదని ఆయన చెప్పారు. అవసరమైతే దాడుల్ని మరిన్ని రోజులు కొనసాగిస్తామని, వెనక్కి తగ్గేది లేదన్నారు.