హైదరాబాద్ లో వర్షాకాలం ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ చర్యలు

హైదరాబాద్ లో వర్షాకాలం ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ చర్యలు

ముషీరాబాద్, వెలుగు: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. బుధవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్ డివిజన్ లలిత నగర్ కాలనీలో పలు కార్యక్రమాలు చేపట్టారు. సుమారు వంద మంది జీహెచ్ఎంసీ కార్మికులతో కాలనీలో మట్టి, ఇసుక, ఫుట్​పాత్​లపై మొక్కలను, మట్టి దిబ్బలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. 

వర్షాకాలంలో నీరు సాఫీగా నాలాల్లోకి వెళ్లేందుకు ఈ డ్రైవ్ ను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 20 వరకు ఈ పనులు కొనసాగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంహెచ్ ఓ ప్రవీణ, శానిటేషన్ ఎస్ఎఫ్ఐ చంద్రశేఖర్, నవీన్ బాబు, గంగాధర్, శ్రీధర్ రెడ్డి, హరికుమార్  పాల్గొన్నారు.